అమాయకుడు


శ్రీరంగపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం వుండేది. ఆరోజుకు సరిపడే ఆదాయంతో వారి బ్రతుకులు గడుస్తుండడమే కానీ ఆస్తివాస్తులు, నగలు, నాణ్యాలు, పాడిపంటలు మొదలయినవేవీ వారికి లేవు వారికి ఒక్కగానొక్క కొడుకు నాడు శుద్ధ అమాయకుడు. వాడి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఎంతో గారాబంగా పెంచుకుంటు న్నారేగాని, అతడికి కాస్తయినా విద్యాబుద్ధులు నేర్పించలేకపోయారా నిరుపేదలు.

కొంత కాలానికా కుర్రవాడు పెద్దవాడై యుక్త వయస్కుడయ్యాడు. అతనికి పెళ్లి చేయాలని వాళ్ళకు పిల్లా పాప కలిగితే చూచి ఆనందించాలని ఆశ కలిగిందా దంపతులకు సిరిసంపదలు లేకపోయినా చక్కనైన సాంప్రదాయాలు, కట్టుబాట్లు సంస్కారం కలిగిన కుటుంబీకులు కావడం వల్ల ఎక్కడెక్కడనుండో సంబంధాలు వస్తుండేవి. వచ్చినవారంతా వారి ఆర్థిక పరిస్థితులకు భయపడి వెళ్లిపోతూండేవారు అమాయకుడే అయినా ఆ కుర్రవాడు మంచివాడు . కలుపుగోలుతనం కలిగినవాడు కావడం వల్ల ఇరుగు పొరుగు వారికి కూడా వచ్చిన సంబంధాలన్నీ తిరిగి పోతూండడం బాధ కలిగింది. వాళ్ళూ ఆ దంపతున్ని కలుసుకొని "అయ్యా మీ పరిస్థితులు ఇల్లాగే గడ్చిపోవచ్చు. పిల్లవాడికి భార్య వచ్చిన వేళావిశేషం వలన సంపన్నులు కాకపోతారా చూడవచ్చిన వారికి అలానే చూపిస్తే వారికేం నచ్చుతుంది. ఉన్నంతలో కాస్త దర్జాగానే చూపించండి అబ్బాయిని" అని సలహా ఇచ్చారు.

అంతలో ఒక సంబందం వచ్చింది. నాళ్ళు కుర్రవాడ్ని చూస్తామన్నారు. తల్లిదండ్రుల ఆలోచించి ఇరుగుపొడుగువారి సలహా ప్రకారం కుర్రవాడ్ని దర్జాగా చూపించడానికే. నిర్ణయించుకున్నారు. ప్రక్కింటి వారిని అడిగి చెవుల పోగులు తెచ్చి కుర్రవాడి చెవులకు అలంకరించారు. పిల్లనివ్వ వచ్చిన పెద్దల ముందు కూర్చోబెట్టారు మాటలో ఒకాయన పిల్లవాడి గుణగణాదున్ని పరిశీలిస్తూ "బాబూ! నీ పేరేమిటని ప్రశ్నించాడు" ఫలానా అని చెప్పడు. ఏం చదువుకున్నావని అడిగాడు అది చెప్పాడు. ఇంకా ఏమేమో అడిగేసరికి అన్ని చెప్పి ఇంక దుద్దులు గురించి కూడా అడిగేస్తారని ఊహించుకుని నా చెవులకున్న ఈ దుద్దులు మా ప్రక్కింటి వారివి అన్నాడు దానితో ఈ పెళ్లివారు సంబంధం వదులుకుని వెళ్ళిపోయారు .

తమ కొడుకు అమాయకతకు ఆ తల్లిదండ్రులు బాదపడి వాళ్ళతో అలా నావి కాదు అనకూడదు బాబు అని చెప్పేరు మరికొంత కాలానికి మరో సంబంధం వచ్చింది. అప్పుడ తల్లిదండ్రులు మళ్ళీ ఆ దుద్దులు తెచ్చి అతనికి పెట్టారు. ఆ పెళ్ళివారు అతడితో ఏమేనా -"మాట్లాడుతూ అనేక ప్రశలు వేశారు. వాటన్నిటికీ ఎంతో జాగ్రత్తగా సమాధానాలు చెప్పేడా అలా చెప్పిచెప్పి చెవులకున్న దుద్దులు కూడా నావేనని అన్నాడు. ఆ పెళ్ళివారు లోలో -నవ్వుకుని వెళ్ళిపోయారు.
అలా అనకూడదు అని తల్లిదండ్రులతడిని మందలించారు. నా ఊసు నీకెందుకు? అన్నారు.


మళ్లీ కొంతకాలం గడిచాక మరొక సంబంధం వచ్చింది. ఈసారి తల్లి దుద్దులు అతడికి పెడుతూ నీటిని గురించి నువ్వు మాట్లాడకూడదు బాబూ అన్నది. మరి వాల్లడిగితేనో అన్నాడు. అడగరు అడిగినా నువ్వేం అనకూడదు అని హెచ్చరించింది. వచ్చిన పెళ్లి వారి ముందు కూర్చుంటూనే అన్నాడు గదా.. "చూడండి మీరు నన్ను ఏమైనా అడగండి గాని నా చెవు దుద్దుల గురించి మాత్రం అడగటానికి వీలులేదు. అడిగినా నేనేం చెప్పను అన్నాడు. తల్లిదండ్రులు వెళ్లిపోతున్న పెళ్ళివారిని చూచి తలగొట్టుకున్నారు.

ఆ తరువాత చేసేదిలేక ఆ అమాయకుడిచేత అబద్ధమాడించడం తప్పని నిర్ణయించుకుని, తమలోనే ఒక నిరుపేద పిల్లను ఓ వెర్రి బాగులదాన్ని తెచ్చి పెళ్లి చేసి తృప్తిపడ్డారు.