భగవద్గీత



రామనాథం మాస్టారు చక్కని ఉపాధ్యాయులు మాత్రమే కాదు సమయోచితమైన సలహాలతో అందరికీ నుంచిని పెంచే మహామనిషి ఒకరోజు రామనాథం మాష్టారుగారు గోపి అనే విద్యార్థి జన్మదినం సందర్భంగా భగవద్గీత పుస్తకం ఇచ్చాడు. భగవద్గీత పుస్తకాన్ని చూసి గోపీతో సహా అతని స్నేహితులు గొల్లున నవ్వి "వృద్ధులకు ఉపయోగపడే భగవద్గీత యువకుడినైన నాకెందుకు బహుమతిగా ఇచ్చారు?" అని
అప్పుడు రామనాధం మాష్టారు అక్కడివారిని వుద్దేశించి, "ఇది వృద్ధులు మాత్రమే చదివే పుస్తకం కాదు మానసిక పరిపక్వత చెందని మావంటి యువకులు చదవాల్సిన మహాగ్రంథం ఎందుకంటే నేటి సమాజంలో యువతకు మంచి చెడుకు మధ్య తేడా తెలీటం లేదు.
మహావీరుడైన అర్జునుడు సంశయ మనస్కుడై కర్తవ్యాన్ని విస్మరించిమోహసముద్రంలో పడిపోతున్న సమయంలో అతడికి సత్యం వివరించి విషాదం నుండిబయటకు లాగి కార్యోమ్ముఖుణ్ణి చేసింది భగవద్గీత అందుకే ఈ గ్రంథం ప్రపంచంలోనిఅన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది.
అలాగే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యంలేక చావే శరణ్యం అని భావించే వారికి సముద్రంలో దిక్కు తెలియని నావకు దిక్సూచివంటిటి భగవద్గీత కనుక పిల్లలనుండి వృద్ధులవరకూ అందరూ చదవాల్సిన అద్భుత గ్రంథ భగవద్గీత" అని విరించాడు.
రామనాథం చెప్పిన మాటల్లో సత్యం వున్నట్లు అక్కడ వున్నవారందరూ గ్రహించి చెప్పట్లతో తమ హర్షం వెలిబుచ్చారు.