బుద్ధి హీనులు


ఒకానొక ఊరి చెరువులో ఒక పెద్ద కప్ప ఉండేది. తాను చాలా గొన్నదానినని దానికి ఎడతెగని గర్వం దాని పిల్లలకు అది ఎప్పుడూ యేవేవో లేనిపోని గొప్పలను చెప్పతుండేది. నాకన్నా గొప్ప జంతువీ లోకంలో లేదని . ఒకనాడొక ఎద్దు ఆ౦బోతుకన్నా పెద్దదొకటి ఆ చెరువుకు నీళ్ళు త్రాగడానికి వచ్చింది. దానిని ఈ బోదురు కప్ప పిల్లలు చూసాయి. అవి అంతకు ముందెన్నడూ ఎద్దును చూడకపోవడం వల్ల దాన్ని చూచి ఎంతో ఆక్షర్యపోయాయి. అని తిన్నగా తల్లి కప్ప దగ్గరకు వెళ్ళాయి . నీకన్నా గొప్ప జంతువే లేదన్నావు అదేదో కొండంత జంతువు ఒడ్డున నిలబడి నీళ్ళు త్రాగుతోంది. రా చూద్దాం అని తీసుకువచ్చాయి.

కప్ప పిల్లలతో ఒడ్డుకొచ్చి ఎద్దును చూచింది. అదొక ఎద్దార దాన్ని చూసి మీరు అశ్రరపోతున్నారు? ఈ చెరువు చాలదనీ నేను పెరగడం లేదుగాని, అంతవడం యేమంత వింతగాదు. దానంత యేం ఖర్మ? అంతకన్నా మించే పెరుగుతాను చూడండి అంటూ ఊపిరి గట్టిగా బిగపట్టి పొట్టముట్టించింది. కప్ప పిల్లలు బిలబిలలాడుతూ చప్పట్లు చరిచాయి.

కప్పమరింతగా ఉబ్బి కప్ప ఎంతో పెద్దదిగా తయారయ్యింది. భలే భలే నువ్వు చాలా గొప్పదానిని. పెద్దదానికి కావాలి. ఆ ఎద్దుకన్నా పెద్దదానిని కావాలి అంటూ కప్ప పిల్లలు గోలచేశాయి. వాటిని కాదనలేక తాను చేతగాని దానినని అనిపించుకోలేక, తన శక్తి ఎంతవరకో తెలుసుకోలేక కప్ప ఇంకా ఎక్కువగా ఊపిరి బిగపట్టింది.

దానితో కప్పుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యింది. పిల్లలపట్టు మరీ ఎక్కువయ్యింది. ఊపిరి తీసుకోవాలంటే పిల్లలు యేం గేలిచేస్తాయో అని అలాగే సతమతమౌతూ తన పొట్టను ఇంకా పెద్దది చెయ్యాలనే తాపత్రయం పడసాగింది. అంతలో ఆ పొట్ట గాలి ఒత్తిడికి "ఢాం" అని పిలిపోయింది. ఆ కప్ప చచ్చిపోయింది.

బుద్ధి హీసులు తమ అంతస్తును మరచి, లేని గొప్పలకు పోయి తబ్బిబ్బల పాలై తట్టుకోలేక ముప్పునే తెచ్చుకుంటారు.