మనోయజ్ఞం


త్రేతాయుగంలో శ్రీరామ, రావణ యుద్ధంనకు ముందు నముద్రానికి వంతెన నిర్మించుటకు శ్రీరాముని అనుచరులైన వానరులు ప్రతీరాతి మీద రామ అన్న పదాన్ని వ్రాసి, దానిని తీసుకెళ్ళి సముద్రంలో వేయగానే అది తేలి వంతెనకు అవసరమైన విధంగా సమకూరుతుండేది.
అక్కడే నిల్చుని ఇదంతా గమనిస్తున్న శ్రీరామునికో వింతకోరిక జనించింది. "ఆహా! నా పేరు మహిమవల్లే కదా... ఈ రాళ్ళు సముద్రంలో మునిగిపోకుండా నీటిలో తేలుతున్నాయి. అలాంటప్పుడు నేను విసిరే రాతి మీద నా పేరెందుకు రాసుకోవాలి? ఎటూ తేలుతుంది. కదా"ని తలచి, ఓ రాయి తీసుకుని చుట్టుప్రక్కలంతా కలియజూశాడు. దగ్గర్లో ఎవరైనా తనపనిని గమనిస్తున్నారేమోనని ఎవరూ తనవైపు చూడటం లేదని గుర్తించిన శ్రీరాముడు చేతిలో వున్న రాతిని తత్సారంగా నీటిలోకి విసిరాడు డభేల్ మని శబ్దం రావడంతో దూరం నుండి వస్తున్న హనుమంతుడ కపీమని అక్కడవాలి.
శ్రీరాముని చర్చను చూసి "ప్రభూ! తమరి అనుచరుల మైన మేము ఇందరముండగా తమరు జలగర్భంలోకి రాళ్ళు వేయటమా!" అని దీనంగా పలికాడు.. శ్రీరాముడు అందుకు జవాబివ్వక తాను విసిరిన రాయివైపు తదేకంగా చూస్తున్నాడు.. హన్మంతుడు కూడా తన ప్రభువు విసిరిన రాయివైపు చూడడం మొదలపెట్టాడు.
కొన్ని గంటలు గడిచిపోయాయి కానీ రాముడు విసిరిన రాయి తేలలేదు. అంటే అది నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈ వింత సంఘటనకు ఆశ్చర్య చకితుడైన హన్మంతుడు "ప్రభూ! ఇదేంటి.. అవతారపురుషులైన తమరు వేసిన రాయి నీటిలో మునిగిపోవడమా?" అని ప్రశ్నించాడు.
ఆ చర్చకు సిగ్గు పడిన శ్రీరాముడు భక్తునివైపు చూసి అంజనేయా! ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. నేను నా పేరు, మహిమను చూసి గర్వపడి వింత సంకల్పం చేశాను.
మీరంతా భక్తి అనే మనోయజ్ఞంతో చేసే కార్యాలు సార్థకమైనవి. ఈ యుగధర్మం కూడా ఇదే. నేను చేసిన పని వికర్మతో కూడుకున్నది సుకర్షతో భక్తితో చేసే పనులు నీటిలో తేలిన రాష్ట్రలాగ పలువురికి కన్పిస్తాయి. అంతేకాక అని ఒక ప్రయోజనాన్ని సాధిస్తాయి. కానీ అహంఅనే వింత కోరికతో చేసే పనులు నీటిలో మునిగిపోయే రాళ్ళలాగ పదిమంది దృష్టిలోపడకపోవడమేకాక వాటివల్ల కలిగే ప్రయోజనం కూడా ఏమీ వుండదు" అని జవాబిచ్చాడు.
"మహాప్రభూ! ఎట్టివారికైనా నింతకోరికలు వుండకూడదు. యుగధర్మం పాటించాలనే ఈ దివ్యమైన తమ సందేశం చిరస్మరణీయమైనది. లోకానికి ఆదర్శవంతమైనది" అని భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ స్వామి పాదాల మీద వాలిపోయాడు హన్మంతుడు.