పొగరు


కాకులు దూరని ఒకానొక కీకారణ్యంలో ఒక చెవులపిల్లి, తాబేలు ఉంటుండేవి. అడవిలో గల జంతువులన్నింటిలో తానే గొప్పదాన్నిని కుందేలుకు ఎంతో గర్వం, సాటి జంతువులకు దాని ప్రవర్తన మాటలు అంతగా నచ్చేవికావు తన అంతటి చురుకైన జంతువుగాని, వేగంగల జంతువుగాని, తెలివితేటలుగల జంతువుగాని మరొకటి లేదని తనను తాను తెగ పొగడు కుంటుండేది.
అతి మెల్లగా నడిచే తాబేలును చూస్తే ఆ కుందేలు కెంతో లోకువ "ఏంటో తాబేలు బావా! నాతో పరుగు పందెం వేస్తావేమిటి?" అంటూ వెటకారం చేసింది. పాపం ఆ తాబేలు యేమీ అనేదికాదు. ఇలా అంటుండడం అలవాటయిపోయి పదిమంది ముందు గర్భంగా మాట్లాడుతుండేది..
ఒకనాడు జంతువులన్నీ గుమిగూడి ముచ్చటడా మాట్లాడుకుంటున్న సమయంలో కుందేలుకు తన దర్శం ప్రదర్శించుకోవాలన్నా అహంభావం కలిగింది. దానితో ఒళ్ళు తెలియకుండా నోటికి వచ్చిన ప్రగల్భాలన్నీ చెప్పడంప్రారంభించింది. చుట్టూ చేరిన జంతువులా మాటలకు అసహ్మించుకుంటూదానినోట్లో నోరుపెడితే మర్యాద దక్కదనిమాట్లాడ కుండా ఊదుకున్నాయి.

అలా వుండడంతో కుందేలు ఒక్క తెలియకుండామాట్లాడుతూ "ఈ తాబేలు బావ నాతో పరుగుండెం వెయ్యాలని కలలు కంటున్నాడు.. అడుగు తీస్తే అడుగు వెయ్యలేడు. ఎందుకొచ్చిన 'అమ్మది" అంటూ పొగరుబోతుతనంగా నూట్లాడింది. "పరుగులో గొప్పదాననుకునే ఓ పొగరుబోతు! ఎవరి జన్మ ఎంతటిదో ఎవరికి తెలుసు? నాతో పాటుకూడా నడవలేనిరోజు నీకు రాకపోదు మిడిసి పడకు" అన్నది తాబేలు 'అల్గో భావకు పౌరుషం వచ్చిందే నీతోపాటు నడకకే నేను తగని రోజులుదాకా ఎందుకు? ఏం అదేదో ఇప్పుడే చూద్దాం వస్తావా యేం? తారతమ్యం తెలియకుండా మిడిసినడకు!" అన్నది కుందేలు "పొగరుబోతు కుందేల! అంతటి గర్వం తగదు" అని మందలించింది తాబేలు "అదేమిటో తేల్చుకుందాం రా నాతో పరుగుపందానికి" అని అంది.

కుందేలు సై అంటే సై అనుకున్నాయి తాబేలు, కుందేలు, అడవికి ఆవలవుస్త నగరం పొలిమేర వరకూ వెళ్ళి రావాలి. ఎవరు ముందస్తే వారు గెలిచినట్టు అని జంతువులన్నీ నిర్ణయించాయి.
రెండూ కలసి బయలుదేరాయి. చిటికెలో కుందేలు కనుచూపుదూరం పోయించి తాబేలు నెమ్మదిగా కదులుతూ వుంది. జంతువులన్నీ హుషారిస్తున్నాయి. కనుచూపు దూరం పోయి కుందేలు ఇదంతా గమనించి నేనెందుకింత ఆదుర్దాగా పరుగెట్టాలి? హాయిగా కాసేపిక్కడ ఆగి తాబేలు దగ్గరపడ్డాక మెల్లగా బయలుదేరుతాను • అనుకొని ఆగిపోయింది అంతలో దానికి ఆకలి జ్ఞాపకమొచ్చి అక్కడి ఆకులు, దుంపలు తింటూ వుండిపోయింది.
తాబేలు ఆ చోటు దాటి ముందుకు సాగిపోయింది. దుంపలనీ తిని తేన్చుకుంటూ త్రోవలో కొచ్చిన కుందేలు తనకన్నా ముందుగా తాబేలు వెళ్ళిపోవడం చూచింది. ఒక్క ఉదుటున పరుగు ప్రారంభించింది పరుగెత్తి పరుగెత్తి అలసటొచ్చేవరకు వరుగెత్తి వెనక్కు చూసింది. తనకు వెనకబడిన తాబేలు కనుచూపుమేరలో ఎక్కడా దానికి కనబడలేదు. బ్రతుకుజీవుడా అని మెల్లగా నడవసాగింది.
కుందేలు తిని పరుగుపెట్టి బాగా అలసిపోయిందేమో నిద్ర ముంచుకురావడంతో ఒక పొదరించి నీడలో హాయిగా పడుకుంది. అలా పడుకున్న కుందేలుకు తెలివొచ్చేసరికి చీకటి పడిపోయి చాలాసేపు పడుకుండి పోయానే అని కంగారు పడి ముందుకు బయలుదేరింది.

అలా బయలుదేరిన కుందేటుకు ఎదురొస్తున్న తాబేలు దాని వెనక జంతువులు కనబడ్డాయి. అవన్నీ దగ్గరకంటూ వచ్చి 'ఏం కుందేలా ఇంకా ఎక్కడికి వెడతావు? తాబేలు నీకన్నా ముందే వెళ్లివచ్చేసింది నేను చాలా వేగమయిన దానినని దబాయించే దానివి. తాబేలుతోనే గెలవలేకపోయావు ఎందుకొచ్చిన ప్రగల్భాలు ఎవరు యేనాడు ఎలా భంగపడతారో ఎవరికి తెలుసు ? నేను గొప్ప అని విర్రవీగే వారెప్పుడూ అర్ధకులవల్లనే భంగపాటు పొందుతారు! అని మందలించాయి. అనాటినుండి కుందేలు డాబుమాని అన్నింటితో కలసి మెలిసి తిరుగుతుండేది.