సోమరి


రామాపురంలో వీరయ్య అనేవాడుండేవాడు వీరయ్య వట్టి సోమరిపోతు. ఏ పనీ చేసేవాడు కాదు. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తిని ఖర్చుచేసి, హాయిగా నిద్రపోయేవాడు.

ఆ యేడు రామాపురంలో వరదొచ్చింది. వరద రావడంతోనే వీరయ్య పనివాడు అక్కడికి వచ్చి "బాబూ.. ఊరిలోకి వరదొచ్చింది. మీరు వెంటనే లేచి మన ధాన్యం బస్తాలు తరలించండి" అని చెప్పాడు. దానికి వీరయ్య "వరదొచ్చి ఏం చేస్తుందిలే... వచ్చిపోతుందిలే అంటూ పనివాడిని పంపించివేశాడు.
అనంతరం ఊరిలోకి వరదొచ్చి ధాన్యం బస్తాలన్నీ నీటిలో కొట్టుకు పోయాయి. సోమరిపోతు అయిన వీరయ్య దీనిని పట్టించుకోలేదు.

ఈ సంఘటన జరిగిన నెలరోజులకి, వీరయ్య పనివాడు మరలా వచ్చి "బాలూ. మన ఇల్లు కాలిపోతుంది.. వెంటనే వచ్చి మంటలు ఆర్ప౦డి' అని చెప్పాడు. "దానికి వీరయ్య అగ్ని అన్న తర్వాత మండక ఏం చేస్తుంది" నీవేమీ భయపడకు. అదే ఆరిపోతుంది" అని చెప్పాడు నిద్రపోతూనే.

అంతే. అగ్ని ప్రమాదంలో వీరయ్య వస్తువులన్నీ తగులబడిపోయాయి. కొంతకాలా నికి నీరయ్య వద్ద పున్న సామ్ము కాస్తా అయిపోయింది సొమ్ము అయిపోవడంతో తినడానికి డబ్బులేక వీరయ్య మలమల మాడిపోయాడు వీరయ్య సోమరిపోతు కావడం వల్ల ఎక్కడా అప్పుకూడా పుట్టలేదు.
తన సోమరితనమే తన నీ స్థితికి తీసుకొచ్చిందని గ్రహించాడు వీరయ్య ఆ నాటినుంచి అతడు కష్టపడి పని చేయడం మొదలు పెట్టాడు.