తెలివి


ఓ గ్రామంలో ఒక జమీందారు వుండేవాడు. అతడి పేరు రామరాజు అతడి భార్యపేరు రాజమ్మ రామరాజుకు పెద్ద ఇల్లుంది. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ, చెట్లతోనూ ఎంతో అందంగా వుండేది. అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తూండేవారు. ఒకరోజు ఒకతను. వచ్చి తాను అనాధనని, నా అన్నవారు ఎవరూ లేరని, తనకేదైనా పని ఇప్పించండని తనకి జీతమివ్వకపోయినా ఫర్వాలేదు. అన్నంపెడితే చాలని రామరాజు, రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు. వారిద్దరూ దయతలచి పనిలో పెట్టుకున్నారు.
అతడు రామరాజు వద్ద తన పేరు 'చెట్టు' అని, రాజమ్మ వద్ద 'నీరు' అని చెప్పాడు. ఓరోజు అతను ఆమాందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. ఆమెపరుగు పరుగున వెళ్ళి భయంగా తన భర్తతో "ఏవండీ! నీరు డబ్బు దొంగిలిస్తున్నా"డండి.అని చెప్పింది. అప్పుడు రామరాజు "నీకేమైనా పిచ్చా! నీరు డబ్బు దొంగిలించడమేమిటి?నీరుకి చేతులున్నాయా? కాళ్ళున్నాయా? నీకంతా పిచ్చికాకపోతే" అని బయటకు నడిచాడు.
అప్పుడు రాజమ్మ "అదేనండి.. మనింట్లో క్రొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగిలించిపారిపోతున్నాడండి వాడ్ని పట్టుకోండి" అని అన్నది. అప్పుడు రామరాజు తెల్లబోయి వేరే రంగా.భీముడు." అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. అప్పుడా.కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు రామరాజు కూలీలను చెట్టును కాదురా! డబ్బు దొంగిలించుకుపోతున్న వ్యక్తినిపట్టుకోండిరా.." అనే లోపల ఆ'దొంగ తప్పించుకు పారిపోయాడు.
తెలివి ఒకరి సొత్తు కాదు.
.