తెనాలి రామకృష్ణుడు భటులను అధిగమించాడు

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు, జ్ఞాని అయిన తెనాలి రామకృష్ణున్నికి విభేదాలు వచ్చాయి. కోపంతో, రాజు ఒక్క కత్తితో రామక్రిషుని తల నరికివేయమని భటులను ఆదేశించాడు.

ఇద్దరు భటులు రామకృష్ణుని ఉరితీయడానికి నదీతీరానికి తీసుకెళ్లారు. ఉరితీయడానికి సమయం వచ్చినప్పుడు, ఆ పనిని ఎవరు నిర్వహించాలనే దానిపై ఇద్దరు భటులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రామకృష్ణుడు జోక్యం చేసుకుని, “మీరిద్దరూ కలిసి ఎందుకు తీయకూడదు ?” అని అన్నాడు. భటులు అందుకు అంగీకరించి రామకృష్ణుడిని నదిలో మోకాళ్ల లోతులో నిలబెట్టారు.

రక్షకభటులు కత్తులు ఎగురవేయగా, రామకృష్ణుడు “ఆగండి! నాకు ఒక చివరి కోరిక ఉంది."అని అన్నాడు .

భటులు కత్తులు దించి అతని చివరి కోరిక ఏమిటని అడిగారు. రామకృష్ణుడు, "నేను మా కాళి పేరును తలుచుకున్న తర్వాత మీరు నన్ను ఉరి తీయాలని నేను కోరుకుంటున్నాను ." దీనికి రక్షక భటులు అంగీకరించారు.

రామకృష్ణుడు ఊపిరి బిగపట్టి, “జై మా కాళీ!” అని అరిచాడు. కత్తులు అతని మెడపై కొట్టబోతుండగా, రామకృష్ణుడు త్వరగా నీటిలో మునిగిపోయాడు. కత్తులు రామకృష్ణుడి మెడను తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి.

రక్షకభటులు మళ్లీ అతని మెడ పైన కొట్టుటకు సిద్ధమవుతుండగా, రామకృష్ణుడు , “మీకు ఒక్కసారి మాత్రమే కొట్టమని రాజుగారి ఆజ్ఞ. ఇప్పుడు మీరు ఒకసారి తప్పిపోయినందున, మీరు మళ్లీ ప్రయత్నించలేరు

తెనాలి రామకృష్ణుని చాకచక్యం, చాతుర్యం కారణంగా రక్షక భటులు సందేహం లో పడ్డారు. అప్పుడే, రాజభవనం నుండి ఒక దూత మరణశిక్షను ఆపి, రామకృష్ణుడిని తిరిగి రాజభవనానికి తీసుకురావాలని ఆజ్ఞతో వచ్చాడు. తెనాలి రామకృష్ణుడు రాజభవనంలోకి అడుగు పెట్టగానే, రాజు అతనిని కౌగిలించుకుని, అతని ఆవేశానికి క్షమాపణలు చెప్పాడు.

కథ యొక్క నీతి : ఎప్పుడూ కోపంతో నిర్ణయాలు తీసుకోకండి.